News February 6, 2025

టెస్టు క్రికెట్‌లో అరుదైన సంఘటన

image

టెస్టు క్రికెట్‌లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అరంగేట్ర మ్యాచులోనే కెప్టెన్సీ చేసిన ప్లేయర్‌గా జింబాబ్వేకు చెందిన జోనథన్ క్యాంప్‌బెల్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు మరే ప్లేయర్ తన తొలి మ్యాచులోనే జట్టుకు నాయకత్వం వహించలేదు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచులో రెగ్యులర్ కెప్టెన్ క్రెగ్ ఇర్విన్ వ్యక్తిగత కారణాలతో అనూహ్యంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. దీంతో క్యాంప్‌బెల్ జట్టు పగ్గాలు అందుకున్నారు.

Similar News

News February 6, 2025

GREAT: పండ్లు అమ్ముతూ జీవనం.. వచ్చిన లాభంతో అన్నదానం!

image

కేరళలోని త్రిసూర్‌లో జేసన్ పాల్ అనే వ్యక్తి పండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ఆయన తనకొచ్చిన లాభంలో అధిక మొత్తాన్ని పేదల ఆకలి తీర్చేందుకు వెచ్చిస్తున్నారు. ఆయన వారంలో ఆరు రోజులు 100 నుంచి 150 మంది పేదలకు భోజనం అందిస్తున్నారు. పట్టలం రోడ్డులో రోజూ మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. అన్నార్తుల ఆకలి తీర్చుతున్న జేసన్ పాల్ గొప్ప మనసును అభినందించాల్సిందే.

News February 6, 2025

ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

image

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News February 6, 2025

రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

image

AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.

error: Content is protected !!