News March 19, 2024
జగన్కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే: దస్తగిరి

AP: జగన్ పరిపాలన రాక్షస పాలనను తలపిస్తోందని పులివెందుల జై భీమ్ రావు భారత్ పార్టీ MLA అభ్యర్థి దస్తగిరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఈసారి జగన్కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని అన్నారు. వివేకా హత్య కేసులో తాను అప్రూవర్గా మారకపోయి ఉంటే తనకు కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.
Similar News
News October 16, 2025
ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం బయల్దేరిన మోదీ, CBN, పవన్

AP: రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ముగ్గురూ కలిసి శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. ఆలయం వద్ద 1,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News October 16, 2025
రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం రేపు సాయంత్రం 4 గంటలకు తెరుచుకోనుంది. నెలవారీ పూజల నిమిత్తం అర్చకులు రేపు గుడి తలుపులు తీసి, దీపాన్ని వెలిగిస్తారని ట్రావెన్కోర్ దేవస్థానం తెలిపింది. ఈనెల 18న ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా అక్టోబర్ 22న దర్శన సమయాల్లో ఆంక్షలు ఉంటాయంది.
News October 16, 2025
UG&PG విద్యార్థినులకు సైన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం

సైన్స్ రంగంలో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థినులకు L’Oréal India స్కాలర్షిప్ అందిస్తోంది. UG&PG విద్యార్థినులు అర్హులు. ఇంటర్లో 85%, డిగ్రీలో 60% మార్కులు వచ్చి, కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. UGకి రూ.62,500, PG & PhDకి రూ.1,00,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. చివరి తేదీ: 03-11-2025. మరిన్ని వివరాలకు https://www.loreal.com/, https://www.buddy4study.com/ను సంప్రదించవచ్చు.