News March 19, 2024
అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో భాగమే!

అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోనిదేనని ఇటీవల చైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆ ఈశాన్య రాష్ట్రం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. పదేపదే నిరాధార వాదనలు చేసినంత మాత్రాన అవి నిజమైపోవని పేర్కొంది. దేశం నుంచి ఆ రాష్ట్రాన్ని విడదీయలేమంది. అభివృద్ధి కార్యక్రమాలతో అరుణాచల్ ప్రజలు భవిష్యత్తులోనూ లబ్ధి పొందుతారని తెలిపింది.
Similar News
News April 1, 2025
నొప్పి అంటే ఏంటో చూపిస్తా: హూతీలకు ట్రంప్ మాస్ వార్నింగ్

తమ దేశానికి చెందిన నౌకలపై దాడులు ఆపాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హూతీలను హెచ్చరించారు. లేదంటే మీతోపాటు ఇరాన్కు కూడా నొప్పి అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. తమ నౌకలపై దాడులు ఆపేవరకూ హూతీలపై దాడులు ఆపమని స్పష్టం చేశారు. ఇరాన్ కూడా హూతీలకు తక్షణమే మద్దతు ఆపాలన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు 300 సార్లకుపైగా USకు చెందిన నౌకలపై దాడులు చేశారు
News April 1, 2025
IPL: నేడు లక్నోతో పంజాబ్ కింగ్స్ ఢీ

IPLలో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు లక్నోలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆడిన తొలి మ్యాచులోనే పంజాబ్ ఘన విజయం సాధించి జోరు మీద ఉంది. ఈ మ్యాచులో కూడా గెలిచి 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన భావిస్తోంది. మరోవైపు లక్నో తొలి మ్యాచులో ఓటమిపాలైనా, రెండో మ్యాచులో SRHపై గెలిచింది. ఇదే జోరులో పంజాబ్ను ఓడించాలని యోచిస్తోంది.
News April 1, 2025
నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.