News February 7, 2025

అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

image

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.

Similar News

News April 17, 2026

‘జిమ్’ దుస్తులతో డేంజర్

image

జిమ్‌కు వెళ్లేవారు కంఫర్ట్ కోసం టైట్‌గా ఉండే సింథటిక్(Activewear) దుస్తులను వాడటం పెరిగింది. అయితే ఆ దుస్తుల్లో వాడే థాలేట్స్ అనే రసాయనాలు హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘బ్రీతబిలిటీ లేకపోవడం వల్ల బాడీ టెంపరేచర్ పెరిగి చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, రాషెస్ వస్తాయి. అందువల్ల వదులుగా ఉండే కాటన్ దుస్తులు వాడటం మంచిది’ అని సూచిస్తున్నారు.

News April 17, 2026

హార్ముజ్‌ ఓపెన్ చేశాం: ఇరాన్

image

క్రూడ్ ఆయిల్ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచానికి ఇరాన్ ఊరటనిచ్చింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ట్వీట్ చేశారు. లెబనాన్‌తో ఇజ్రాయెల్ సీజ్‌ఫైర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీజ్‌ఫైర్ అమలులో ఉన్నంత <<19668983>>కాలం<<>> (మరో 9 రోజులు) జలసంధి తెరిచే ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటనతో ముడి చమురు ధరలు భారీగా తగ్గిపోయాయి.

News April 17, 2026

ఆ తప్పులు సరిదిద్దేందుకే డీలిమిటేషన్: షా

image

దేశంలో 127 నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని కేంద్రమంత్రి అమిత్ షా LSలో అన్నారు. ‘ఒక దగ్గర 38 లక్షల మంది ఓటర్లు ఉంటే మరో చోట 6 లక్షల మంది ఉన్నారు. ఇలాంటి నియోజకవర్గాలు దేశంలో చాలా ఉన్నాయి. డీలిమిటేషన్ వల్ల ఇలాంటి తప్పులను సరిదిద్దవచ్చు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ కావాలనే డీలిమిటేషన్ ఆపింది. జనాభా లెక్కలకు డీలిమిటేషన్‌ను మేం లింక్ చేయలేదు. కాంగ్రెస్సే చేసింది’ అని స్పష్టంచేశారు.