News February 7, 2025

TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు కొలిక్కి

image

TG: TPCC కార్యవర్గ కూర్పుపై కసరత్తు తుదిదశకు చేరింది. నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇచ్చే అవకాశముంది. కార్యవర్గంలో సామాజిక న్యాయం పాటించాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి చామల, రోహిణ్, రాజేందర్.. SCల నుంచి సంపత్, కవ్వంపల్లి, ప్రీతం.. STల నుంచి బలరాం, బెల్లయ్య, మురళి.. మైనారిటీల నుంచి ఖురేషి, అజారుద్దీన్, ఫిరోజ్‌ ఖాన్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 16, 2025

వచ్చే నెల విశాఖకు గూగుల్

image

AP: విశాఖకు వచ్చే నెల గూగుల్ సంస్థ రానుందని నిన్న కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ త్వరలో ఏర్పాటు కానుందన్నారు. కూటమి అధికారం చేపట్టాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భవిష్యత్‌లో భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.

News September 16, 2025

CAT-2025 దరఖాస్తుకు గడువు పొడిగింపు

image

CAT-2025 రిజిస్ట్రేషన్‌ గడువును SEP 20 వరకు పొడిగించారు. ఆసక్తిగల డిగ్రీ ఉత్తీర్ణులైన, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న విడుదల చేస్తారు. క్యాట్ -2025 ప్రవేశ పరీక్ష NOV 30వ తేదీన నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.2600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://iimcat.ac.in/

News September 16, 2025

75% హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతి

image

CBSE విద్యార్థులు టెన్త్, 12వ తరగతి పరీక్షలు రాయాలంటే 75% హాజరు ఉండాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ప్రస్తుతం ఫలితాల వెల్లడికి ఇంటర్నల్ అసెస్‌మెంట్ తప్పనిసరి. అయితే హాజరు శాతం తక్కువగా ఉంటే అసెస్‌మెంట్ సాధ్యం కావట్లేదని బోర్డు పేర్కొంది. దీంతో కఠినంగా 75% హాజరు నిబంధన అమలు చేయాలని నిర్ణయించింది. ఫలితంగా హాజరుశాతం, క్లాస్‌రూం యాక్టివిటీస్ పెరుగుతాయని భావిస్తోంది.