News February 8, 2025

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి ముందంజ

image

బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్‌లో ఉన్నారు. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశ వ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రస్తుతం 40+ స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.

Similar News

News February 8, 2025

ఢిల్లీ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలనకు ఓటేశారు: మోదీ

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం పొందడంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘జనశక్తి ప్రధానం. అభివృద్ధి, సుపరిపాలనను గెలిపించారు. ఈ చరిత్రాత్మక విజయాన్ని అందించిన ఢిల్లీలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు సెల్యూట్. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో, వికసిత్ భారత్‌ను నిర్మించడంలో ఢిల్లీ ప్రధాన పాత్ర పోషించే విధంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.

News February 8, 2025

రెపోరేటు తగ్గింపు.. EMI ఎంత తగ్గుతుందంటే?

image

RBI రెపోరేటును 6.25శాతానికి తగ్గించింది. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై EMI కూడా తగ్గనుంది. 20 ఏళ్ల కాలపరిమితికి రూ.20 లక్షల ఇంటి రుణం తీసుకున్న వారికి ఏడాదికి రూ.3,816, రూ.30 లక్షలైతే రూ.5,712, రూ.50 లక్షలు తీసుకుంటే రూ.9,540 తగ్గుతుంది. అలాగే ఐదేళ్ల కాలపరిమితికి కారు లోన్లు తీసుకుంటే రూ.5 లక్షలకు ఏడాదికి రూ.732, రూ.7 లక్షలకు రూ.1020, రూ.10 లక్షలకు రూ.1464 వరకు EMI తగ్గుతుంది.

News February 8, 2025

ఆప్ ఓటమి.. స్వాతి మాలీవాల్ ట్వీట్ వైరల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా కేవలం ‘ద్రౌపది వస్త్రాపహరణం’ ఫొటోతో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అని, ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అని, ఎంతో కష్టపడి బీజేపీని గెలిపించారని కామెంట్స్ చేస్తున్నారు. స్వాతి కష్టాన్ని బీజేపీ గుర్తిస్తుందని అంటున్నారు.

error: Content is protected !!