News February 8, 2025
ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.
Similar News
News December 31, 2025
సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్కు ₹50,000 ఫైన్

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్ వసూలు చేసినందుకు ముంబైలోని బోరా బోరా రెస్టారెంట్కు CCPA ₹50,000 ఫైన్ వేసింది. కస్టమర్ అనుమతి లేకుండానే 10% సర్వీస్ ఛార్జ్ కలిపింది. దానిపై అదనంగా GST కూడా వసూలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని CCPA స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జ్ పూర్తిగా స్వచ్ఛందమని గుర్తుచేసింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్ తప్పనిసరి చేయొద్దని ఢిల్లీ హైకోర్టు గతంలోనే తీర్పిచ్చింది.
News December 31, 2025
ESIC MC& హాస్పిటల్లో 95 పోస్టులు

<
News December 31, 2025
నిమ్మలో కలుపు ఉద్ధృతి తగ్గాలంటే..

నిమ్మ తోటలకు డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే 25-30% కలుపు తగ్గుతుంది. చెట్ల పాదుల్లో వరి పొట్టు, ఊక, ఎండిన ఆకులు, వేరుశనగ పొట్టు, ఎండిన పంట వ్యర్థాలను వేస్తే అది మల్చింగ్గా ఉపయోగపడి కలుపు తగ్గుతుంది. అలాగే అవి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. 100 మైక్రాన్ల ప్లాస్టిక్ మల్చింగ్ షీటును కూడా వాడి కలుపును కట్టడి చేయొచ్చు. ఆక్సిఫ్లోరోఫిన్ మందును లీటరు నీటికి 1-1.5ML కలిపి చెట్ల పాదుల్లో పిచికారీ చేయాలి.


