News February 8, 2025
ఢిల్లీ ఎన్నికల డిసైడర్స్.. పూర్వాంచలీ ఓటర్స్

బిహార్, తూర్పు UP, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన ఓటర్లను పూర్వాంచలీ ఓటర్లుగా వ్యవహరిస్తారు. ఢిల్లీ ఎన్నికల్లో వీరిదే నిర్ణయాత్మక శక్తి. 40 లక్షలమంది ఓటర్లలో 25శాతం ఓట్లు వీరివే. 27 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యం, ప్రభావం ఉంది. 12 సీట్లలో వీరిది మెజారిటీ. గత 2 ఎన్నికల్లోనూ ఆప్కు మద్దతుగా నిలిచిన వీరు ఈసారి BJP వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది.
Similar News
News February 14, 2026
సిక్సర్లే కాదు ఒక మార్కు ప్రశ్నా ముఖ్యమే.. ట్వీట్ వైరల్

అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ CBSE టెన్త్ పరీక్షలు రాయనున్న విషయం తెలిసిందే. దీనిపై ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘మైదానంలో లాగే కంగారు పడకుండా 100 మార్కుల కోసం పూర్తి 180 నిమిషాలు వాడుకోవాలి. ఫోర్లు, సిక్సర్లలాగే (4, 6 మార్కులు) ఒక మార్కు ప్రశ్నలను కూడా వదలకూడదు’ అని సరదాగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.
News February 14, 2026
ఏపీ బడ్జెట్.. రంగాల వారీగా

☛ విద్యుత్-రూ.13,934 కోట్లు, ☛ పరిశ్రమలు-₹3,161కోట్లు,
☛ రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టులు-₹13,546Cr,
☛ వీబీ జీ రామ్ జీ -₹8,365Cr, ☛ పోలవరం ₹6,105Cr
☛ తల్లికి వందనం ₹9,668Cr, ☛ మహిళా శిశు సంక్షేమం ₹4,581Cr
☛ గృహ నిర్మాణం-₹5,451Cr, ☛ ఎన్టీఆర్ వైద్య సేవ ₹4,000Cr
☛ జల్ జీవన్ ₹4,000Cr, ☛ స్వచ్ఛ్ భారత్ మిషన్ ₹1,037Cr, ☛ విశాఖ ఆర్థిక ప్రాంతానికి ₹28,000Cr , రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు ₹30,000Cr
News February 14, 2026
రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.


