News February 8, 2025

32 ఏళ్ల తర్వాత ఢిల్లీలో BJPకి 47% ఓటుషేర్

image

ఢిల్లీ ఎన్నికల్లో BJP విజయానికి పెరిగిన ఓటు షేరే కారణం. 32 ఏళ్ల తర్వాత ఆ పార్టీ 47% ఓటుషేర్ సాధించింది. 1993లో 47.82% ఓట్లు పొందిన కాషాయ దళం మళ్లీ 2025లో 47% సాధించడం గమనార్హం. 1998లో 34.02, 2003లో 35.22, 2008లో 36.34, 2013లో 33.00, 2015లో 32.30, 2020లో 38.51 శాతంతోనే సరిపెట్టుకుంది. చివరి రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువే పొందినా అసెంబ్లీలో అందుకోకపోవడంతో ఢిల్లీ పీఠం అందని ద్రాక్షగా మారింది.

Similar News

News February 8, 2025

లిక్కర్ స్కామ్‌లో భాగమైన మూడు పార్టీలు బలి!

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుతో సంబంధమున్న మూడు పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆప్‌లు ఓటమి చవిచూశాయి. లిక్కర్ స్కామ్‌లో ఆప్ నుంచి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్, బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, వైసీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డికి ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయి. ఇదే కేసులో వీరందరూ ఢిల్లీ తిహార్ జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు.

News February 8, 2025

PHOTO: అల్లు అర్జున్ సూపర్ లుక్

image

‘పుష్ప-2’ కోసం గడ్డం పెంచిన అల్లు అర్జున్ ఈ మధ్యనే లుక్ మార్చారు. పుష్ప-2 థాంక్యూ మీట్‌లో సందడి చేసిన ఆయన గడ్డం ట్రిమ్ చేసి మరింత స్టైలిష్‌గా కనిపించారు. పుష్ప-2 రిలీజ్ తర్వాత పలు ఘటనలతో ఆయన మీడియాకు దూరమయ్యారు. ఈ క్రమంలో తాజా లుక్ అదిరిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన తదుపరి చిత్రంపై ప్రకటన మార్చిలో వచ్చే అవకాశముంది.

News February 8, 2025

OFFICIAL: బీజేపీకి 48, AAPకు 22 సీట్లు

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగిరింది. ఈసీ అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 70 స్థానాల్లో 48 చోట్ల బీజేపీ విజయం సాధించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వరుసగా మూడో సారి ఖాతా తెరవలేకపోయింది. ఈసీ లెక్కల ప్రకారం బీజేపీ 45.66%, ఆప్ 43.57%, కాంగ్రెస్ 6.34% ఓట్లు సాధించాయి.

error: Content is protected !!