News February 9, 2025
CCL: తెలుగు వారియర్స్ ఓటమి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739041160220_893-normal-WIFI.webp)
సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.
Similar News
News February 9, 2025
వేడి వాతావరణం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739057648204_893-normal-WIFI.webp)
AP: వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం నెలకొందని, నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు ఎక్కువగా రికార్డయినట్లు తెలిపింది. నందిగామలో వరుసగా ఐదో రోజు అత్యధికంగా 37.6 డిగ్రీలు నమోదైంది.
News February 9, 2025
నేడే రెండో వన్డే.. జట్టులో ఎన్ని మార్పులు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739059152593_893-normal-WIFI.webp)
IND, ENG మధ్య కటక్ వేదికగా ఇవాళ మ.1:30 నుంచి రెండో వన్డే జరగనుంది. కోహ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో జైస్వాల్ను తప్పిస్తారా? రోహిత్ ఫామ్లోకి వస్తాడా? వరుణ్ చక్రవర్తికి తుది జట్టులో చోటు దక్కుతుందా? అతడి కోసం కుల్దీప్ను పక్కన పెడతారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఎలాగైనా గెలవాలని ENG కసిగా ఉంది. sports 18-2, hotstarలో లైవ్ చూడవచ్చు. WAY2NEWS లైవ్ స్కోర్ అప్డేట్స్ పొందవచ్చు.
News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739058580059_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.