News February 9, 2025
దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రమాదకరం: రేవంత్

TG: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని సీఎం రేవంత్ విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు ఇంత వివక్ష అని కేరళలోని ఓ సభలో ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలకు ప్రధాని మోదీ ప్రమాదకరమని, దక్షిణాది ప్రజలంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఒకే వ్యక్తి-ఒకే పార్టీ అనేది మోదీ రహస్య విధానమన్నారు.
Similar News
News January 12, 2026
చైనా మాంజా అమ్మితే ఉక్కుపాదం: ఎస్పీ నరసింహ

జిల్లాలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ఆకస్మిక తనిఖీల్లో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రాణాంతకమైన ఈ మాంజా వల్ల మనుషులకు, పక్షులకు ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ మాంజాను కొనివ్వకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 12, 2026
భూగర్భ జలాల్లో యురేనియం కాలుష్యం: CGWB

APలో భూగర్భ జలాలు విస్తృతంగా కలుషితం అవుతున్నాయని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నివేదిక పేర్కొంది. ‘ఏపీ సహా 4 రాష్ట్రాల భూగర్భ జలాల్లో 30Ppm మించి యురేనియం సాంద్రత ఉన్నట్లు తేలింది. సత్యసాయి జిల్లాలో 16, తిరుపతిలో 3 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉంది. పలుచోట్ల పరిమితికి మించి సోడియం కార్బొనేట్ అవశేషాలు (26.87%) ఉన్నాయి. AP సహా కొన్ని రాష్ట్రాల భూగర్భంలోకి సముద్ర జలాలు చొచ్చుకువస్తున్నాయి’ అని తెలిపింది.
News January 12, 2026
నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్పై రేవంత్

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.


