News March 19, 2024
స్టార్ క్రికెటర్కు బిగ్ షాక్
టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న శ్రీలంక క్రికెటర్ వనిందు హసరంగాకు ఐసీసీ షాకిచ్చింది. రీఎంట్రీ తర్వాత ఆడనున్న తొలి రెండు టెస్టులకు సస్పెండ్ చేసింది. ఈ నెల 18న బంగ్లాతో జరిగిన వన్డేలో అతడు అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐసీసీ 3 డీమెరిట్ పాయింట్లతో పాటు 2 టెస్టులకు సస్పెండ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్తో జరగనున్న తొలి రెండు టెస్టులకు హసరంగ దూరమయ్యారు.
Similar News
News October 1, 2024
ముడా స్కామ్.. ఆ భూముల్ని తిరిగిచ్చేస్తానన్న సీఎం భార్య
ముడా స్కామ్కు సంబంధించి కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి పార్వతి ముడాకు లేఖ రాశారు. కేసుకు కారణమైన 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. భర్త గౌరవం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, సిద్దరామయ్య 40 ఏళ్లుగా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు.
News October 1, 2024
కొనసాగుతున్న బీజేపీ ‘రైతు హామీల సాధన దీక్ష’
TG: హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ‘రైతు హామీల సాధన దీక్ష’ కొనసాగుతోంది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్తో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 24 గంటల దీక్ష చేస్తున్నారు. ‘అర్ధరాత్రి 2 దాటినా రైతు హామీల సాధన దీక్ష కొనసాగుతోంది. బీజేపీ ప్రతినిధులు దీక్షా శిబిరంలో సేద తీరుతున్నారు’ అని ఇందుకు సంబంధించిన ఫొటోలను టీ బీజేపీ Xలో పోస్ట్ చేసింది.
News October 1, 2024
వరద బాధితుల ఖాతాల్లో రూ.588కోట్లు జమ
AP: వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అందిన పరిహారంపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మొత్తం ₹602కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ₹588కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు అధికారులు CMకి తెలిపారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయి లేకపోవడం, అకౌంట్ క్లోజ్ అవ్వడం, వివరాలు సరిగా లేకపోవడంతో కొందరి అకౌంట్లలో నగదు జమ కాలేదని, బ్యాంక్కు వెళ్లి KYC పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించామన్నారు.