News February 11, 2025
నేడు వైసీపీ నేతలతో జగన్ సమావేశం

AP: ఇవాళ వైసీపీ ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్ తాడేపల్లిలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు హాజరవుతారు. పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే జగన్ జిల్లాల టూర్పై కూడా ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలపై నేతలతో జగన్ చర్చిస్తారు.
Similar News
News January 25, 2026
H-1B షాక్.. ఇంటర్వ్యూలు 2027కి వాయిదా

అమెరికా H-1B వీసా దరఖాస్తుదారులకు భారీ షాక్ తగిలింది. ఇండియాలోని US కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ పెరగడంతో వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్లు 2027కి వాయిదా పడ్డాయి. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో స్లాట్లు లేకపోవడంతో ఇప్పటికే ఇండియా వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇతర దేశాల్లో స్టాంపింగ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోవడంతో ఉద్యోగాలు, కుటుంబాల విషయంలో ఆందోళన నెలకొంది.
News January 25, 2026
తగ్గనున్న BMW, ఫ్రెంచ్ వైన్ ధరలు?

భారత్-EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న జరిగే India-EU సమ్మిట్లో ఒప్పందం ఖరారు లాంఛనంగా కనిపిస్తోంది. అదే జరిగితే BMW, ఫోక్స్వ్యాగన్ వంటి ప్రీమియం కార్లు, ఫ్రెంచ్ వైన్ సహా అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇండియా నుంచి టెక్స్టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో EU మార్కెట్ భారత్కు కీలకం కానుంది.
News January 25, 2026
T20 WC.. ఏ గ్రూపులో ఏ జట్లు ఉన్నాయంటే?

ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్లో పాల్గొనే జట్ల గ్రూపులను ICC ప్రకటించింది. భారత్, పాకిస్థాన్ గ్రూప్-Aలో ఉన్నాయి. బంగ్లాదేశ్ WC నుంచి తప్పుకోవడంతో గ్రూప్-Cలో దాని స్థానంలో స్కాట్లాండ్ను చేర్చారు. పై ఫొటోలో ఏ గ్రూపుల్లో ఏ జట్లు ఉన్నాయో చూడొచ్చు.


