News February 12, 2025
పల్నాడులో తగ్గిన చికెన్ ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739337989501_52098404-normal-WIFI.webp)
పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు దిగివస్తున్నాయి. 10 రోజుల క్రితం కేజీ చికెన్ రూ.280 వరకు ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ. 240-260 వరకు విక్రయిస్తున్నారు. తెలంగాణ, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న కోళ్లకు సంబంధించి వ్యాపారులకు లైవ్ కోడి కేజీ రూ.50-60లు, చికెన్ రూ. 150-160ల వరకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ధర తక్కువ ఉన్న చికెన్ పట్ల ప్రజలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News February 12, 2025
ఏ సినిమాకు వెళ్తున్నారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739350166795_746-normal-WIFI.webp)
ఈ వారం కొత్త సినిమాల కంటే పాత సినిమాల హవానే ఎక్కువగా ఉంది. వాలంటైన్స్ డే కావడంతో పలు సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈనెల 14న విశ్వక్సేన్ ‘లైలా’, బ్రహ్మానందంతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ కలిసి నటించిన ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్ కానున్నాయి. ఇక అదేరోజున రామ్ చరణ్ ‘ఆరెంజ్’, సూర్య ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, సిద్ధూ జొన్నలగడ్డ ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో రిలీజ్ కానున్నాయి.
News February 12, 2025
చికెన్ తినడంపై ప్రభుత్వం కీలక ప్రకటన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358201566_81-normal-WIFI.webp)
AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆయా గ్రామాల్లో ఒక KM ప్రాంతాన్ని అలర్ట్ జోన్గా ప్రకటించింది. 10KM పరిధిని సర్వైలన్స్ ప్రాంతంగా ప్రకటించి, కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది. అలర్ట్ జోన్ ప్రాంతంలో మినహా మిగతా చోట్ల ఉడకబెట్టిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పశుసంవర్ధక శాఖ తెలిపింది. చికెన్ ప్రియులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది.
News February 12, 2025
NZB: యాక్సిడెంట్లో వ్యక్తి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355713649_50582768-normal-WIFI.webp)
వర్ని మండలం జాకోరా ఎక్స్ రోడ్డు వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మరణించాడు. స్థానికులు 108కు, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు. వ్యక్తిని గుర్తించిన వారు వర్ని పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ రమేశ్ పేర్కొన్నారు.