News February 13, 2025
LoC వద్ద రెచ్చిపోయిన పాక్.. తిప్పికొట్టిన భారత్!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739422082642_367-normal-WIFI.webp)
నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు తెగబడగా భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల LoC వద్ద ఇద్దరు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
Similar News
News February 13, 2025
19న BRS విస్తృతస్థాయి సమావేశం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736617762335_1226-normal-WIFI.webp)
TG: ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని KCR నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రజతోత్సవాలు, సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై KCR అధ్యక్షతన జరిగే భేటీలో సమాలోచనలు చేయనున్నారు.
News February 13, 2025
రైతులకు 9 గంటల విద్యుత్ అందాల్సిందే: మంత్రి గొట్టిపాటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739446787070_81-normal-WIFI.webp)
AP: వేసవిలో విద్యుత్ కోతలు ఉండరాదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ అందాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ మీటర్ల పరికరాల బిల్లులను చెల్లించారనే ఆరోపణలపై ఎస్పీడీసీఎల్ ఎండీ సంతోష్రావును వివరణ కోరారు. ఈ విషయంలో సీఎం అసంతృప్తిని ఎండీకి వివరించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా పనిచేయాలని సూచించారు.
News February 13, 2025
రూ.500 ఇచ్చి ఫొటో పంపిస్తే.. కుంభమేళాలో స్నానం!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444045060_746-normal-WIFI.webp)
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న ‘మహాకుంభమేళా’ను ఇప్పటికే 45 కోట్ల మంది భక్తులు సందర్శించారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చాలా మంది పాల్గొనలేకపోతున్నారు. అలాంటి వారిని ‘ముంచేందుకు’ కొందరు పథకం పన్నుతున్నారు. రూ.500 చెల్లించి ఫొటోలు వాట్సాప్ చేస్తే వాటిని త్రివేణి సంగమంలో ముంచుతామని, ఇలా చేస్తే మీరు స్నానం చేసినట్లేనని ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.