News March 20, 2024

ఉస్తాద్ భగత్‌సింగ్‌పై CEO కీలక వ్యాఖ్యలు

image

AP: DSC నిర్వహణపై విద్యాశాఖ వివరణ కోరామని CEO ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు తెలిపారు. DSC నిర్వహణపై CECకి లేఖ రాస్తామన్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే EC అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News March 10, 2026

కొరత లేదు.. LPG ఉత్పత్తి 10% పెంపు

image

దేశంలో గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. ఆయిల్ కంపెనీలు 10% LPG ఉత్పత్తిని పెంచాయని, అన్ని కంపెనీలు 100% సామర్థ్యంతో పనిచేస్తున్నాయని పేర్కొంది. కృత్రిమ కొరత నివారణపై కఠినంగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. కేంద్రం ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకే బుకింగ్ పీరియడ్‌ను 21 నుంచి 25 రోజులకు పెంచినట్లు ప్రకటించింది.

News March 10, 2026

భారత్‌లో 53% పెరిగిన ఐఫోన్ల తయారీ

image

భారత్‌లో యాపిల్ ఐఫోన్ల తయారీ భారీగా పెరిగింది. గత ఏడాది ఇక్కడ 55 మిలియన్ ఐఫోన్లు తయారైనట్లు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది 36 మిలియన్ ఐఫోన్లు తయారు కాగా 2025లో ఇది 53% పెరిగింది. ఏటా ప్రపంచవ్యాప్తంగా 220-230 మిలియన్ ఐఫోన్లు తయారు అవుతుండగా.. అందులో భారత్ వాటా ఇప్పుడు 25%కు చేరింది. US-చైనా ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో యాపిల్ ఇండియాలో తమ ఉత్పత్తులను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

News March 10, 2026

ఈ ఇద్దరు MPలు జీతాలు తీసుకోవట్లే!

image

ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా చాలామంది పార్లమెంటేరియన్లు జీతాలు వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ప్రస్తుతం 18వ లోక్‌సభలో మొత్తం 543 మందిలో కేవలం ఇద్దరే జీతభత్యాలు తీసుకోవట్లేదని RTI ద్వారా తెలిసింది. హరియాణా BJP MP నవీన్ జిందాల్ జీతంతో పాటు అన్ని అలవెన్సులను వదులుకోగా కాంగ్రెస్ MP అంగోమ్చా బిమోల్ అకోయిజామ్(మణిపుర్) తన వేతనాన్ని నిరాకరించారు. పదవి ప్రజాసేవకే తప్ప సంపాదనకు కాదు అని వీరు నిరూపించారు.