News March 20, 2024
ఉస్తాద్ భగత్సింగ్పై CEO కీలక వ్యాఖ్యలు

AP: DSC నిర్వహణపై విద్యాశాఖ వివరణ కోరామని CEO ముకేశ్ కుమార్ మీనా కీలక వ్యాఖ్యలు తెలిపారు. DSC నిర్వహణపై CECకి లేఖ రాస్తామన్నారు. మరోవైపు ఉస్తాద్ భగత్సింగ్ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే EC అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. వాలంటీర్లు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News January 15, 2026
స్పైస్ బోర్డ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

AP: గుంటూరులోని స్పైస్ బోర్డ్ 3 SRD ట్రైనీస్, ట్రైనీ అనలిస్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఎస్సీ అర్హత గల వారు ఫిబ్రవరి 4న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు జీతం రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.indianspices.com
News January 15, 2026
నేడే పెద్ద పండుగ.. తెలుగు లోగిళ్లలో సంబరాలు

తెలుగు రాష్ట్రాలకు అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియతో భోగభాగ్యాలు వస్తాయని విశ్వసిస్తారు. పంటలు ఇంటికి చేరే వేళ కావడంతో ఇది రైతుల పండుగగా ప్రసిద్ధి చెందింది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు పల్లెల్ని పండుగ కళతో నింపేస్తాయి. పిండి వంటకాలతో ఇళ్లు పరిమళిస్తాయి. దేశవ్యాప్తంగా పొంగల్, లోహ్రీ, మాఘ బిహు పేర్లతో ఈ పండుగను జరుపుకుంటున్నారు.
News January 15, 2026
నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్

AP: విజయవాడ వెస్ట్ బైపాస్ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్గేట్ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.


