News February 15, 2025
GOOD NEWS: పప్పుల రేట్లు తగ్గాయ్

TG: భారీగా పెరిగిన పప్పుల ధరలు దిగొస్తున్నాయి. గతేడాది రూ.200-240 వరకు వెళ్లిన క్వాలిటీ కేజీ కందిపప్పు ప్రస్తుతం రూ.150-160కి వచ్చింది. క్వాలిటీ తక్కువుండే పప్పు రూ.110-125 పలుకుతోంది. శనగ పప్పు రూ.150 నుంచి రూ.135కు, మినప పప్పు రూ.160 నుంచి రూ.150కి, మైసూర్ పప్పు రూ.130 నుంచి రూ.115కి తగ్గింది. రాష్ట్రంలో పప్పుధాన్యాల సాగు, మార్కెట్లకు సరఫరా పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News November 8, 2025
స్పోర్ట్స్ రౌండప్

➤ WWC విజయం: రిచా ఘోష్ను డీఎస్పీగా నియమించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం
➤ AUSvsIND టీ20 సిరీస్: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అభిషేక్ శర్మ
➤ వరుసగా 12వ టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా
➤ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ
➤ IPL: నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించనున్న జట్లు.. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్లో LIVE చూడొచ్చు.
News November 8, 2025
మురికి కాలువల పక్కన కొత్త ఇల్లు కట్టొచ్చా?

మురికి కాలువల సమీపంలో ఇల్లు కట్టుకోవడం ఆరోగ్యానికి హానికరమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. మురికి కాలువల వల్ల అపరిశుభ్రత, కాలుష్యం పెరిగి, దుర్గంధం కారణంగా తరచుగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఆయన సూచన. ‘నివాస స్థలంలో శుభ్రత, స్వచ్ఛత లేకపోతే అక్కడ సానుకూల శక్తి నిలవదు. అందుకే శుభ్రత, ప్రశాంతత ఉండే ప్రాంతంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి’ అని వాస్తు శాస్త్రం చెబుతోంది. <<-se>>#Vasthu<<>>
News November 8, 2025
చైతూ-సామ్ విడాకులకు రాజ్తో రిలేషనే కారణమా?

సమంత, డైరెక్టర్ రాజ్ క్లోజ్గా ఉన్న <<18231711>>ఫొటో వైరల్<<>> అవడంతో నాగచైతన్యతో ఆమె విడిపోవడానికి ఈ రిలేషనే కారణమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చైతూతో విడిపోకముందు రాజ్ డైరెక్ట్ చేసిన ‘ఫ్యామిలీ మాన్-2’ సిరీస్లో సమంత నటించారు. అయితే ఆ సమయంలోనే రాజ్, సామ్ మధ్య రిలేషన్ ఏర్పడి ఉండొచ్చని, అదే చైతూ-సామ్ విడాకులకు కారణమని పలువురు నెటిజన్లు అంటున్నారు. మరికొందరు సామ్కు సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు.


