News March 20, 2024
షమీ స్థానంలో సందీప్, మధుశంక స్థానంలో మఫకా
IPL: గాయపడ్డ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో సందీప్ వారియర్ను తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. రూ.50 లక్షల ధర చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన సందీప్.. ఇది వరకు ఆర్సీబీ, కేకేఆర్, ముంబై తరఫున ఆడారు. ఇక ముంబై పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫకాను టీంలోకి తీసుకున్నారు. మఫకా అండర్-19 WCలో అత్యధిక వికెట్లు తీశారు.
Similar News
News October 6, 2024
18 మంది సైబర్ నేరగాళ్లు అరెస్ట్
TG: HYD సైబర్ క్రైమ్ పోలీసులు పలు రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి 18 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. రూ.5 లక్షల నగదు, 26 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి బ్యాంక్ ఖాతాల్లోని రూ.1.61 కోట్లను సీజ్ చేశారు. తెలంగాణలో రూ.6.94 కోట్లు దోచేసిన ఈ నిందితులపై దేశవ్యాప్తంగా 400కిపైగా కేసులున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు, డ్రగ్స్, కొరియర్, పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసగించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారు
News October 6, 2024
దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
సుధీర్ వర్మ డైరెక్షన్లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
News October 6, 2024
ఆకస్మిక వరదలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు సమాధి
భారీ వర్షాల కారణంగా మేఘాలయలో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. సౌత్గారో హిల్స్ జిల్లాలోని గసుఆపారాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డాలు ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం కాన్రాడ్ కె సంగ్మా వారికి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.