News March 20, 2024

షమీ స్థానంలో సందీప్, మధుశంక స్థానంలో మఫకా

image

IPL: గాయపడ్డ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్థానంలో సందీప్ వారియర్‌ను తీసుకున్నట్లు గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది. రూ.50 లక్షల ధర చెల్లించి అతడిని సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన సందీప్.. ఇది వరకు ఆర్సీబీ, కేకేఆర్, ముంబై తరఫున ఆడారు. ఇక ముంబై పేసర్ దిల్షాన్ మధుశంక స్థానంలో సౌతాఫ్రికా లెఫ్టార్మ్ పేసర్ క్వెనా మఫకాను టీంలోకి తీసుకున్నారు. మఫకా అండర్-19 WCలో అత్యధిక వికెట్లు తీశారు.

Similar News

News December 6, 2025

న్యూస్ రౌండప్

image

⋆ నేడు నల్గొండ జిల్లా దేవరకొండలో సీఎం రేవంత్ పర్యటన
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
⋆ నేషనల్ హెరాల్డ్ కేసులో DK శివకుమార్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు.. DEC 19న విచారణకు రావాలని ఆదేశం
⋆ నేడు మరోసారి పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి
⋆ శాంతిభద్రతల పరిరక్షణకు HYDలో ‘ఆపరేషన్ కవచ్’.. నిన్న అర్ధరాత్రి దాదాపు 5,000 మంది పోలీసులతో ఏకకాలంలో 150 ప్రాంతాల్లో తనిఖీలు

News December 6, 2025

ఫోన్‌ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

image

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.

News December 6, 2025

ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. భద్రతకు ముప్పు!

image

కేంద్రం పరిశీలిస్తున్న ఫోన్ల లొకేషన్ ట్రాకింగ్ అంశాన్ని యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీకి విరుద్ధమని, ఫోన్లు నిఘా పరికరాలుగా మారుతాయని అంటున్నట్లు సమాచారం. ‘ట్రాకింగ్ తప్పనిసరి చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. యూజర్లలో సైన్యానికి చెందిన వారు, జడ్జిలు, జర్నలిస్టులు ఉంటారు. భద్రతా పరమైన సమస్యలు వస్తాయి’ అని చెబుతున్నట్లు Reuters తెలిపింది.