News February 17, 2025
చనిపోతూ ఆరుగురికి జీవితాన్నిచ్చిన ‘అమ్మ’

పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టిన బిడ్డను కళ్లారా చూడకుండానే చనిపోయిందో మహిళ. తర్వాత అవయవదానం చేసి పలువురిలో సజీవంగా నిలిచిపోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఆషితా(38) ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్తో స్పృహ కోల్పోయారు. వైద్యులు సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. FEB 13న ఆమె బ్రెయిన్ డెడ్ అవడంతో 2 కిడ్నీలు, 2 కార్నియాలు, కాలేయాన్ని భర్త దానం చేశారు. దీంతో సొంత బిడ్డతో సహా ఆరుగురికి జీవితాన్నిచ్చినట్లయ్యింది.
Similar News
News February 1, 2026
ఏపీ ముఖ్యమైన కేటాయింపులు ఇలా..

* అమరావతి రాజధాని అభివృద్ధి(ఏడీబీ నిధులు)- రూ.1,128 కోట్లు
* అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్(జపాన్ నిధులు)- రూ.432 కోట్లు
* గ్రామీణ రహదారులు- రూ.500 కోట్లు
* పట్టణాల్లో తాగు, మురుగు నీటి పారుదల- రూ.800 కోట్లు
* ప్రకృతి వ్యవసాయం- రూ.155 కోట్లు
* రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం- రూ.350 కోట్లు
News February 1, 2026
NIMHRలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

మధ్యప్రదేశ్ సెహోర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ (<
News February 1, 2026
‘లిట్టర్’ నిర్వహణ.. కోళ్ల ఫారాల్లో ముఖ్యం

కోళ్ల ఫారాలలో నేలపై ఎండు గడ్డి, చెక్క పొట్టు, లేదా ఇతర సేంద్రియ పదార్థాల రూపంలో లిట్టర్ ఉంటుంది. దీన్ని కోళ్ల ఫారాలలో పరుపుగా ఉపయోగిస్తారు. ఇది కేవలం కోళ్ల పడక పదార్థమే కాదు. కోళ్ల మల విసర్జనలోని తేమను పీల్చి పొడిగా ఉంచుతుంది. ఫారాల్లో దుర్వాసనను తగ్గిస్తుంది. కోళ్లకు సౌకర్యంగా ఉండేట్లు చేసి.. వ్యాధికారక క్రిములు పెరగకుండా చేస్తుంది. లిట్టర్ నిర్వహణ సరిగాలేకుంటే వ్యాధుల ఉద్ధృతి పెరుగుతుంది.


