News February 17, 2025

చనిపోతూ ఆరుగురికి జీవితాన్నిచ్చిన ‘అమ్మ’

image

పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టిన బిడ్డను కళ్లారా చూడకుండానే చనిపోయిందో మహిళ. తర్వాత అవయవదానం చేసి పలువురిలో సజీవంగా నిలిచిపోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఆషితా(38) ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్‌తో స్పృహ కోల్పోయారు. వైద్యులు సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. FEB 13న ఆమె బ్రెయిన్ డెడ్ అవడంతో 2 కిడ్నీలు, 2 కార్నియాలు, కాలేయాన్ని భర్త దానం చేశారు. దీంతో సొంత బిడ్డతో సహా ఆరుగురికి జీవితాన్నిచ్చినట్లయ్యింది.

Similar News

News July 5, 2025

DANGER.. బ్లూటూత్ వాడుతున్నారా?

image

బ్లూటూత్ ఆధారంగా పనిచేసే స్పీకర్లు, బడ్స్, హెడ్ ఫోన్స్ వాడే వారిని ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ‘హ్యాకర్లు బ్లూటూత్ ద్వారా ఆడియో పరికరాలను నియంత్రణలోకి తీసుకునే అవకాశముంది. సంభాషణలపై నిఘా పెట్టి, కాల్‌ను హైజాక్ చేసే ఛాన్సుంది. పెద్ద బ్రాండ్లు వాడుతున్నా ప్రమాదమే. కాల్ డేటా, కాంటాక్టులను దోచేసే ప్రమాదముంది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్ వాడకుండా ఉండండి’ అని సూచించింది.

News July 5, 2025

ఒకట్రెండు రోజుల్లో KCR ప్రెస్‌మీట్!

image

TG: అనారోగ్యం నుంచి కోలుకున్న మాజీ సీఎం KCR నిన్న యశోద ఆసుపత్రిలోనే పలువురు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ జల హక్కులపై వాస్తవాలు బయటపెడతానని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఒకట్రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇవాళ ఉ.11 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.

News July 5, 2025

పరీక్షల తేదీలు వచ్చేశాయి

image

AP: ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి రాత పరీక్షల సవరణ <>షెడ్యూల్‌ను <<>>APPSC ప్రకటించింది. టీటీడీ కళాశాలల్లో రాత పరీక్ష తేదీలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మిగతా పరీక్షలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరుగుతాయని తెలిపింది. అటు ఆల్ ఇండియా సర్వీసు, రాష్ట్ర సర్వీసు అధికారులు అర్ధవార్షిక, లాంగ్వేజ్ టెస్టులకు దరఖాస్తు చేసుకోవాలని APPSC ప్రకటన విడుదల చేసింది.