News March 21, 2024
మరో రెండేళ్లలో ఎస్-400 డెలివరీ పూర్తి

2026కల్లా రష్యా నుంచి భారత్కు రావాల్సిన మిగిలిన రెండు ఎస్-400 స్క్వాడ్రన్ల డెలివరీ పూర్తికానుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం 5 స్క్వాడ్రన్లను ఈ ఏడాదికల్లా న్యూఢిల్లీకి క్రెమ్లిన్ ఇవ్వాల్సి ఉండగా.. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం కారణంగా అవి ఆలస్యమయ్యాయని వివరించాయి. భారత్ వద్ద ప్రస్తుతం 3 ఎస్-400 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఈ గగనతల రక్షణ వ్యవస్థల్ని చైనా, పాక్ సరిహద్దుల్లో భారత్ మోహరించింది.
Similar News
News September 10, 2025
అలనాటి రోజులను గుర్తు చేసిన హీరోయిన్

90ల్లో టాప్ హీరోయిన్గా మీనా విపరీతమైన క్రేజ్ను సొంతం చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు తగ్గించినా ఈ బ్యూటీ ప్రస్తుతం వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ఆమె దిగిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. 48 ఏళ్లు వచ్చినా మీనా అందం ఏ మాత్రం తగ్గలేదని, ఆనాటి రోజులను గుర్తు చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆమె నటించిన సినిమాల్లో మీకు ఏది ఇష్టం? కామెంట్.
News September 10, 2025
ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు: DGHS

ఫిజియోథెరపిస్టులు డాక్టర్స్ కాదని, వారి పేర్ల ముందు ‘Dr.’ అని పెట్టుకోవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(DGHS) ఆదేశించింది. ఒకవేళ ‘Dr.’ ట్యాగ్ వాడితే అది చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ‘ఇలా చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించినట్లే. మెడికల్ ప్రాక్టీస్పై అవగాహన లేనందున ఫిజియోథెరపిస్టులు ప్రాథమిక చికిత్స చేయకూడదు. వైద్యులు రిఫర్ చేసిన పేషెంట్లనే ట్రీట్ చేయాలి’ అని పేర్కొంది.
News September 10, 2025
ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం!

C.P. రాధాకృష్ణన్ ఈ నెల 12న ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆయనతో ప్రమాణం చేయిస్తారని అధికార వర్గాల సమాచారం. నిన్నటి ఎన్నికలో రాధాకృష్ణన్ 152 ఓట్లతో ఇండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలిచిన విషయం తెలిసిందే.