News February 20, 2025

జగన్ వల్లే ఆర్థిక ఇబ్బందులు: పవన్

image

AP: రాష్ట్రంలో సమన్వయంతో కలిసి నడుస్తున్నామని Dy.CM పవన్ అన్నారు. వెన్నునొప్పి కారణంగా కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ ఆ నొప్పి వేధిస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. అందువల్లే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అయినా హామీలు అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని వివరించారు.

Similar News

News November 1, 2025

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

image

సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి హైదరాబాద్ శంషాబాద్‌కు రావాల్సిన ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఫ్లైట్‌ను వెంటనే ముంబై ఎయిర్‌పోర్టుకు మళ్లించారు.

News November 1, 2025

టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

image

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.

News November 1, 2025

కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.