News February 21, 2025
55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు

AP: రాష్ట్రంలోని బోధన, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని DMEని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78మందికి DME షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటి వరకూ 55మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News February 22, 2025
BREAKING: బాలుడు అర్ణవ్ కన్నుమూత

TG: హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంటు లిఫ్టు-గోడకు మధ్య <<15540977>>ఇరుక్కున్న బాలుడు<<>> అర్ణవ్ కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. నడుము దగ్గర సర్జరీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News February 22, 2025
విపక్షాల ట్రాప్లో పడొద్దు: భట్టి

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News February 22, 2025
కేంద్ర మంత్రికి విరిగిన కుర్చీ.. ఎయిర్ ఇండియాపై ఆగ్రహం

ఎయిర్ ఇండియాపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న తనకు విమానంలో విరిగిన కుర్చీ కేటాయించారని మండిపడ్డారు. డబ్బు తీసుకుని ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నారని, ఇది వారిని మోసం చేయడమేనని దుయ్యబట్టారు. టాటా టేకోవర్ తర్వాత కూడా సంస్థ తీరు మారలేదన్నారు. దీంతో ఎయిర్ ఇండియా క్షమాపణ కోరింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామంది.