News March 21, 2024

అరుణాచల్ భారత్‌దే.. అమెరికా స్పష్టీకరణ

image

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.

Similar News

News November 9, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వివరాలివే

image

✒ ఎల్లుండి పోలింగ్, బరిలో 58 మంది అభ్యర్థులు
‎✒ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు. పోలింగ్ విధుల్లో పాల్గొననున్న 2060 మంది సిబ్బంది
‎✒ 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా. 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తింపు
‎✒ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
‎✒ GHMC ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
✒ ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితం

News November 9, 2025

రేపు క్యాబినెట్ భేటీ.. CII సమ్మిట్‌పై కీలక చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే CII సమ్మిట్ ప్రధాన ఎజెండాగా సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అటు రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం, పంట నష్టం అంచనాలు, రైతులకు అందించాల్సిన పరిహారంపై చర్చించనున్నారు.

News November 9, 2025

MLAపై రేప్ కేసు.. AUSకు జంప్.. మళ్లీ ఆన్‌లైన్‌లో..!

image

రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్ ఆప్ MLA హర్మిత్ సింగ్ ఆస్ట్రేలియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే తిరిగొస్తానని తాజాగా ఆన్‌లైన్‌ వేదికగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 2న పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న హర్మిత్ అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. తనను ఫేక్ ఎన్‌కౌంటర్‌ చేస్తారనే భయంతో పారిపోయినట్లు ప్రచారం జరిగింది.