News March 21, 2024

అరుణాచల్ భారత్‌దే.. అమెరికా స్పష్టీకరణ

image

అరుణాచల్ ప్రదేశ్ భారత్‌దేనని చైనాకు అమెరికా తాజాగా స్పష్టం చేసింది. అరుణాచల్ సరిహద్దుల్ని మార్చేందుకు లేదా ఆక్రమించేందుకు ఏకపక్షంగా చేసే ఏ చర్యనైనా నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని తేల్చిచెప్పింది. అరుణాచల్ తమదేనంటూ చైనా సైన్యం ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ ప్రకటనను భారత్ ఖండించింది. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని కుండబద్దలుగొట్టింది.

Similar News

News April 16, 2025

ISSF వరల్డ్ కప్‌లో మెరిసిన భారత మహిళా షూటర్లు

image

పెరూలో జరిగిన ISSF వరల్డ్ కప్‌లో భారత మహిళా షూటర్లు బంగారం, వెండి పతకాలతో మెరిశారు. ఉమెన్స్ 10మీ. ఎయిర్ పిస్టల్ క్యాటగిరీలో 18 ఏళ్ల సురుచి గోల్డ్ మెడల్ సాధించగా, 2024 ఒలింపిక్స్‌లో డబుల్ మెడల్ విజేత మనూ భాకర్ వెండి పతకం కైవసం చేసుకున్నారు. ఒలింపిక్స్ పతకాల తర్వాత మనూకు ఇదే తొలి అంతర్జాతీయ స్థాయి మెడల్ కావడం విశేషం. తాజాగా వీరిద్దరి ఘనత పట్ల క్రీడారంగ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

News April 16, 2025

అత్యంత ఎత్తైన బ్రిడ్జిపై వందేభారత్ రైలు.. ప్రారంభించనున్న మోదీ

image

వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ మధ్యలో ఉన్న చినాబ్ రైల్వే బ్రిడ్జికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనగా పేరొంది. దీనిపై ఇక వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది. న్యూఢిల్లీ నుంచి కశ్మీర్‌కు సరాసరి నడిచే వందేభారత్ రైలును ఈ నెల 19న మోదీ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం కట్రా-శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణం 7 గంటలుండగా అది 3గంటలకు తగ్గనుంది. ఇది జమ్మూను కశ్మీర్‌ను అనుసంధానించే తొలి రైల్వే లైన్ కావడం విశేషం.

News April 16, 2025

శ్రీశైలంలో అమ్మవారికి వైభవంగా కుంభోత్సవం

image

AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా ఛైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయలు, లక్షకు పైగా నిమ్మకాయలతో ఆలయ అధికారులు ఘనంగా వేడుక జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం కలిగింది. అంతకముందు అన్నం, పెసరపప్పు రాశులుగా పోసి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.

error: Content is protected !!