News February 22, 2025

వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

image

AP: భూ ఆక్రమణ ఆరోపణలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కుటుంబీకులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ రాయచోటిలోని కలెక్టరేట్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలను ఆకేపాటి కుటుంబం ఆక్రమించిందని టీడీపీ నేతలు ఆరోపించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Similar News

News November 14, 2025

60 పోస్టులకు TSLPRB నోటిఫికేషన్

image

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(TSLPRB) 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 27 ఉ.8 గంటల నుంచి డిసెంబర్ 15 సా. 5 గంటల వరకు <>వెబ్‌సైట్‌లో<<>> దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

News November 14, 2025

చేసిన మంచిని చెప్పుకోలేక ఇబ్బంది పడ్డా: CBN

image

AP: సంస్కరణలతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని CM CBN తెలిపారు. ఇందుకు HYD అభివృద్ధే ఉదాహరణ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు రూపొందించాలని సూచించారు. తాను చేసిన మంచిని చెప్పుకోవడంలో కొంచెం వెనుకబడడంతో గతంలో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థతో పాటు AP ఇమేజ్ అంతర్జాతీయంగా దెబ్బతిందన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతా తెరుస్తున్నామని తెలిపారు.

News November 14, 2025

రాష్ట్రంలో మరో 2 ఉపఎన్నికలు.. జోరుగా చర్చ

image

TG: ఫిరాయింపు MLAలపై స్పీకర్ విచారణ కొనసాగుతుండడం తెలిసిందే. వీరిలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి‌(ఘన్‌పూర్) అఫిడవిట్లూ ఇవ్వలేదు. పార్టీ మారినట్లు కడియం చెప్పగా దానం ఏకంగా CONG అభ్యర్థిగా SEC MP ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా WBలో TMCలో చేరిన BJP MLAపై వేటుపడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ 2చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ మొదలైంది. ఈ 2 స్థానాల్లోనూ గెలుస్తామని CONG చెబుతోంది.