News February 22, 2025

GOOD NEWS.. నెలకు రూ.7500?

image

EPFO కనీస పెన్షన్‌ను పెంచాలని ఉద్యోగులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 నుంచి రూ.1000 పెన్షన్ వస్తుండగా, దీనిని రూ.7500కు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులతో ఈ పెన్షన్ చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి PF డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి FEB 28న జరిగే భేటీలో దీనిపై EPFO సెంట్రల్ బోర్డు ప్రకటన చేస్తుందనే ఆశతో ఉన్నారు.

Similar News

News February 23, 2025

భారత జాలర్లను విడుదల చేసిన పాకిస్థాన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ ప్రభుత్వం 22 మంది భారత జాలర్లను విడుదల చేయడం గమనార్హం. 2021-22లో తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ వారిని అరెస్ట్ చేసింది. 22 మందిలో 18 మంది గుజరాత్, ముగ్గురు డయ్యూ, ఒకరు యూపీకి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘థండేల్’ స్టోరీ కూడా ఇలాంటి వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కించిందే.

News February 23, 2025

ICC ఈవెంట్స్ అంటే ఆసీస్‌కు పూనకాలే..

image

కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, మార్ష్ లేరు. స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఉన్న కొద్దిమంది సీనియర్లతో ఆసీస్ టీమ్ CTలో పాల్గొనేందుకు వచ్చింది. ENGతో తొలి మ్యాచ్‌లో కొండంత లక్ష్యం(352). స్మిత్, హెడ్ చెరో 5, 6 పరుగులు చేసి వెనుదిరిగారు. అయినా AUS గెలిచింది. ICC ఈవెంట్స్ అంటే ఆ జట్టు ఆటగాళ్లు ఊగిపోతారు. ఈసారి కొత్త ప్లేయర్ ఇంగ్లిస్ 86 బంతుల్లో 120 రన్స్ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

News February 23, 2025

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్: చికెన్ అంటే భయమా? వీటిని ట్రై చేయండి!

image

బర్డ్ ఫ్లూ భయంతో కొందరు చికెన్‌కు దూరంగా ఉంటున్నారు. చికెన్‌కు ప్రత్యామ్నాయంగా కొన్ని రకాల గింజలు తింటే ఎక్కువ బలాన్ని పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం తింటే కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. శనగలు తింటే పోషకాలు అందుతాయి. వాల్ నట్స్ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. రాజ్‌మా, జనపనార గింజలు తింటే ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.

error: Content is protected !!