News February 22, 2025
మిర్చి రైతులతో CM చంద్రబాబు కీలక భేటీ

AP: మిర్చి రైతులు, ట్రేడర్లతో CM చంద్రబాబు భేటీ అయ్యారు. రైతుల సమస్యలు వినడంతో పాటు కేంద్ర సాయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను CM వారికి వివరించనున్నారు. మిర్చి ధర కొంత కాలంగా తగ్గుతుండటంతో రైతులను ఆదుకునేందుకు సీఎం ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక, మలేషియా, చైనాలో మిర్చి పంట సరిగా రాకపోవడంతో ఆ దేశాలకు అధిక ధరలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News February 23, 2025
5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్

AP: రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 189.9KM మేర అలైన్మెంట్కు ఓకే చెప్పింది. 5 జిల్లాల(ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ORRలో 2 బ్రిడ్జిలు, 78 అండర్పాస్లు, 65 వంతెనలు నిర్మిస్తారు.
News February 23, 2025
మైనర్ బాలికే.. కానీ ఆమెకు అన్నీ తెలుసు: బాంబే హైకోర్టు

మైనర్ బాలికే అయినా ఓ వ్యక్తితో గడిపితే ఎదురయ్యే పర్యవసానాలు అన్నీ ఆమెకు తెలుసని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, ఓ యువకుడితో మూడు రాత్రిళ్లు పరస్పర ఇష్టంతో గడిపింది. కానీ తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ యువకుడిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి ఐదేళ్లు జైల్లో పెట్టారు. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం పరస్పరం ఇష్టంతో గడిపినందుకే అతడికి బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది.
News February 23, 2025
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత జరిగే BAC సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈనెల 25న చర్చ జరగనుంది. 26న శివరాత్రి, 27న MLC ఎన్నికల నేపథ్యంలో సభ ఉండదు. 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్పై చర్చ జరగనుంది.