News February 22, 2025

మిర్చి రైతులతో CM చంద్రబాబు కీలక భేటీ

image

AP: మిర్చి రైతులు, ట్రేడర్లతో CM చంద్రబాబు భేటీ అయ్యారు. రైతుల సమస్యలు వినడంతో పాటు కేంద్ర సాయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను CM వారికి వివరించనున్నారు. మిర్చి ధర కొంత కాలంగా తగ్గుతుండటంతో రైతులను ఆదుకునేందుకు సీఎం ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక, మలేషియా, చైనాలో మిర్చి పంట సరిగా రాకపోవడంతో ఆ దేశాలకు అధిక ధరలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News April 14, 2026

రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్

image

AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
*Share It

News April 14, 2026

చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు రేవంత్ లేఖ

image

దక్షిణాది రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, స్టాలిన్, సిద్దరామయ్యకు తెలంగాణ సీఎం రేవంత్ లేఖ రాశారు. నియోజకవర్గాల పెంపుపై కలిసి పోరాడుదామని కోరారు. కేంద్రం చర్యల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు <<19651062>>అన్యాయం<<>> జరుగుతోందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని సూచించారు. నియోజకవర్గాల పెంపులో హైబ్రిడ్ మోడల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.

News April 14, 2026

గ్రాము బంగారానికి ₹11వేల లాభం!

image

2019 OCT 15న ఇష్యూ అయిన సిరీస్-5 సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ రేపటి నుంచి చేసుకోవచ్చని RBI ప్రకటించింది. అప్పుడు గ్రాము ధర ₹3,738 ఉంటే ఇప్పుడు ₹15,009కు (₹11,271 లాభం) చేరింది. ఏప్రిల్ 9, 10, 13 తేదీల్లో గోల్డ్ ప్రైస్ యావరేజ్ ఆధారంగా RBI దీనిని డిసైడ్ చేసింది. మొత్తంగా 302% ప్రాఫిట్.. అంటే ₹లక్ష పెట్టిన వారికి ₹4లక్షలు వస్తాయి. ఇది కాక ఏటా ఇచ్చే 2.5% వడ్డీ కూడా యాడ్ అవుతుంది.