News February 24, 2025
నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News February 24, 2025
తండ్రి చనిపోయిన దు:ఖంలోనూ రచయితకు ప్రభాస్ సాయం!

హీరో ప్రభాస్పై ‘బిల్లా’ రచయిత తోట ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేను 2010 FEBలో ఆస్పత్రిపాలయ్యా. అదేరోజు ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ రాజు గారు చనిపోయారు. దుఖంలో ఉన్నప్పటికీ ఆయన నా వైద్యం కోసం డబ్బులు పంపించి హెల్ప్ చేశారు. నాపట్ల అంత కేర్ తీసుకున్నారాయన. తండ్రిని కోల్పోయినప్పటికీ నా సినిమా రైటర్ అని నా గురించి ఆలోచించారు’ అని తనకు ప్రభాస్ చేసిన సాయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
News February 24, 2025
వంశీపై పీటీ వారెంట్

AP: గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో జైలులో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీపై పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. రేపటితో రిమాండ్ ముగియనుండటంతో సీఐడీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయనపై మరిన్ని పాత కేసులను ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కస్టడీలో ఉన్న వ్యక్తిపై మరో కేసు నమోదు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టడానికి ముందు పీటీ వారెంట్ జారీ చేస్తారు.
News February 24, 2025
కోహ్లీ సెంచరీ.. అనుష్క శర్మ ❤️ పోస్ట్ వైరల్

పాకిస్థాన్పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసి జట్టును గెలిపించడమే కాకుండా తిరిగి ఫామ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ను టీవీలో చూసిన అనుష్క శర్మ భర్త కోహ్లీని ఫొటో తీసి హైఫై, లవ్ సింబల్తో ఇన్స్టాలో పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు మ్యాచ్ను గెలిపించాక విరాట్ మెడలోని చైన్కు ఉన్న వెడ్డింగ్ రింగ్కు ముద్దుపెట్టారు. దీనికి రిప్లైగా అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.