News February 24, 2025

నేటి నుంచే అసెంబ్లీ సమావేశాలు

image

AP: చాలా కాలం తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. దీంతో అధికార, విపక్ష పార్టీ నేతల పరస్పర విమర్శలతో సమావేశాలు హాట్ హాట్‌గా సాగనున్నాయి. ఇవాళ ఉ.10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News March 24, 2025

మహిళలకు సూపర్ స్కీమ్.. నెలాఖరు వరకే గడువు

image

భారత మహిళలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టాఫీస్ సేవింగ్స్ పథకం MSSC. రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు డిపాజిట్‌లో 40శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫామ్ లభిస్తుంది. ఈ నెలాఖరుకే పథకం ఆగిపోనుంది. మరిన్ని వివరాలకు సమీప పోస్టాఫీసును సంప్రదించవచ్చు. షేర్ చేయండి.

News March 24, 2025

TODAY HEADLINES

image

* KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్
* రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్
* TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం నోటీసులు
* 27న పోలవరానికి సీఎం చంద్రబాబు
* వారు కూడా దక్షిణ భాషలు అర్థం చేసుకోవాలి: పవన్
* ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ
* RRపై SRH విజయం, MIపై చెన్నై విక్టరీ
* బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

News March 24, 2025

సుపరిపాలన అందించే రాష్ట్రాలు బలహీనపడాలా?: కేశినేని నాని

image

AP: నియోజకవర్గాల పునర్విభజన వల్ల AP, TG, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని మాజీ ఎంపీ కేశినేని నాని అన్నారు. జనాభా ప్రాతిపదికన చేపట్టనున్న ఈ ప్రక్రియ న్యాయమైనదేనా? అని SMలో ప్రశ్నించారు. సుపరిపాలన, అభివృద్ధిపై దృష్టి సారించిన రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడాలా అని ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజన జాగ్రత్తగా నిర్వహించకపోతే ఉత్తర-దక్షిణ విభేదాలు పెరుగుతాయని హెచ్చరించారు.

error: Content is protected !!