News February 24, 2025
మహిళలకు GOOD NEWS.. కొత్త పథకాలు

TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మరిన్ని పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు చమురు సంస్థలతో చర్చిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను రూ.2 లక్షలు, రూ.లక్షకు పెంచనుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు, అంగన్వాడీలు, సహాయ సంఘాల సభ్యులకు చీరలు అందించనుంది.
Similar News
News February 24, 2025
అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు: జగన్

AP: సభలో చర్చించేందుకు సమయం ఇవ్వాల్సి వస్తుందనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజా సమస్యలపై ప్రశ్నించేందుకు ఎక్కడా తగ్గం. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పాటిస్తున్నాం. ఇంత దూరం ప్రయాణం చేశాం. కళ్లు మూసి తెరిచేలోగా జమిలి ఎన్నికలు వస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News February 24, 2025
జియో క్రికెట్ డేటా ప్యాక్.. 90 రోజులు ఉచితంగా!

క్రికెట్ అభిమానుల కోసం జియో సరికొత్త ప్యాక్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్స్టార్ విలీనమై ‘జియో హాట్స్టార్’గా మారిన విషయం తెలిసిందే. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్ కోసం డేటాతో పాటు సబ్స్క్రిప్షన్ ఉండే ప్యాక్ తీసుకొచ్చింది. రూ.195 చెల్లిస్తే 15GB డేటాతో పాటు 90 రోజుల పాటు ‘JIO HOTSTAR’ సబ్స్క్రిప్షన్ పొందొచ్చు.
News February 24, 2025
పాకిస్థాన్లో HIGH ALERT.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్?

పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మ్యాచ్లను వీక్షించడానికి వచ్చిన విదేశీయులను కిడ్నాప్ చేయడానికి పథకం వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ దేశంలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(TTP), ISIS, బలూచిస్థాన్ గ్రూపులు యాక్టివ్గా ఉన్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో CTపై ప్రభావం పడే అవకాశం ఉంది.