News February 24, 2025
ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో మార్పు రాలేదు: రేవంత్

TG: కేసీఆర్ ఇక రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయనలో మార్పు రాలేదని CM రేవంత్ విమర్శించారు. ఫామ్హౌస్లో కూర్చుని ఆయన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ MLC ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘పదేళ్లపాటు ఏమీ చేయని BRS ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తోంది. రాష్ట్రం కోసం పోరాడిన గ్రాడ్యుయేట్లకు ఏం చేశారు? టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు ఎందుకు చేపట్టలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News February 24, 2025
పురుష వైద్యులు మహిళా సిబ్బందికి రక్షణగా ఉండాలి: ప.బెంగాల్ సీఎం

వైద్య రంగంలో పనిచేస్తున్న పురుషులు తమతో పని చేసే మహిళా ఉద్యోగులకు రక్షణగా ఉండాలని ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. హెల్త్ కేర్ సెక్టార్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆర్జీకర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలికి నివాళులు అర్పించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రూ.10,000-రూ.15,000 వరకు జీతాల పెంపును ప్రకటించారు.
News February 24, 2025
CM రేవంత్పై కిషన్ రెడ్డి ఫైర్

TG: చీకటి ఒప్పందాలు చేసుకునే అవసరం BJPకి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. BRS, BJP కుమ్మక్కయ్యాయని CM రేవంత్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ‘మేము నీతి నిజాయితీతో బతికేవాళ్లం. మీలాగా కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగేవాళ్లం కాదు. మీలా పార్టీలు మారలేదు. దయ్యమన్న సోనియాను దేవత అంటూ వెళ్లి కాళ్లు పట్టుకోలేదు’ అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును CBIకి అప్పగిస్తే విచారణ ముందుకు వెళ్తుందని అన్నారు.
News February 24, 2025
ఫైబర్నెట్ ఎండీ దినేశ్ కుమార్పై వేటు

AP: ఫైబర్నెట్ ఎండీ దినేశ్ కుమార్పై వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీకి రిపోర్టు చేయాలని దినేశ్ కుమార్ను ఆదేశించింది. మరోవైపు ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. కాగా ఫైబర్నెట్కు చెందిన పూర్తి నివేదిక సీఎం చంద్రబాబు దగ్గరికి చేరినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగానే ఎండీని జీఏడీకి అటాచ్ చేసినట్లు సమాచారం.