News March 21, 2024

BREAKING: బీజేపీ మూడో జాబితా.. తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే?

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బరిలో నిలవనున్నారు. కోయంబత్తూరు-అన్నామలై, చెన్నై సెంట్రల్-వినయ్ పి.సెల్వం, వెల్లూర్-ఏసీ షన్ముగం, కృష్ణగిరి-సి.నరసింహన్, నీలగిరి-మురుగన్, పెరంబళూర్-పారివేంధర్, తూత్తుకుడి-నాగేంద్రన్, కన్యాకుమారి-రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు.

Similar News

News January 14, 2026

HYD: ఎంట్రీ FREE.. కైట్ ఫెస్టివల్‌కు వెళ్దాం పద!

image

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్, స్వీట్ ఫెస్టివల్ జోరుగా, హుషారుగా సాగుతోంది. 2వ రోజు సిటీలోని నలుమూలల నుంచి వేలాది మంది తరలివచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ ఎగరేస్తున్న పతంగులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానికులు, కైట్ ప్లేయర్స్, కళాకారులు Way2Newsతో తమ ఒపినియన్స్ పంచుకున్నారు. రేపటితో కైట్ ఫెస్టివల్ ముగుస్తుంది. తొందరగా వెళ్లండి మరి.
GOOD NEWS ఏంటంటే ప్రవేశం ఉచితం.

News January 14, 2026

‘10 మినిట్స్ డెలివరీ’పై జెప్టో, స్విగ్గీ వెనక్కి

image

కేంద్రం <<18845524>>ఆదేశాలతో<<>> 10 మినిట్స్ డెలివరీ క్లెయిమ్‌ను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో నిలిపివేశాయి. నిన్న బ్లింకిట్ ఈ ప్రకటన చేయగా తాజాగా ఈ రెండు సంస్థలూ 10 మినిట్స్ క్లెయిమ్‌ను ఆపివేస్తున్నట్లు తెలిపాయి. తమ వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి ‘10 మినిట్స్ డెలివరీ’ అనే ప్రకటనలను తొలగించాయి. కాగా గిగ్ వర్కర్ల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ హామీని ఇవ్వొద్దని కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయా డెలివరీ సంస్థలకు సూచించారు.

News January 14, 2026

ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

image

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్‌) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.