News February 25, 2025
‘ఛావా’ కలెక్షన్ల దండయాత్ర

బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.353.61 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న ఒక్క రోజే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ లీడ్ రోల్లో నటించారు.
Similar News
News February 25, 2025
ఎల్లుండి SLBCకి BRS నేతలు: హరీశ్రావు

TG: SLBC ఘటన చాలా దురదృష్టకరమని, చాలా బాధాకరమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఎల్లుండి తమ పార్టీ నేతలు SLBC సందర్శనకు వెళ్తారని, పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అటు ఈ ఘటనపై జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి KTR ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఘటనపై విచారణ చేపట్టాలని సూచించారు.
News February 25, 2025
అసెంబ్లీలో జల్సా మూవీ గురించి చర్చ

AP అసెంబ్లీలో జల్సా మూవీ చర్చకు వచ్చింది. విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలని స్పీకర్ అయ్యన్న పవన్ను కోరారు. ‘ఏది అడిగినా డబ్బుతో ముడిపడి ఉంది. జల్సా మూవీలో చొక్కా(బ్రహ్మానందం) జేబులో డబ్బులు ఉంటాయని ఫ్రెండ్స్కు హీరో చెబుతుంటాడు. కానీ అక్కడ ఉండవు. చివరకు అతనే బయటకొచ్చి, ఏముంది చొక్క, బొక్క తప్ప అని అంటాడు. ఇప్పుడు AP పరిస్థితి అలానే ఉంది. YCP ఖజానాను లూటీ చేసింది’ అని ఫైరయ్యారు.
News February 25, 2025
ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్య

AP: రాష్ట్ర ఫైబర్ నెట్ కొత్త ఎండీగా ప్రవీణ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పాత ఎండీ దినేశ్ కుమార్ అవినీతికి పాల్పడ్డారని <<15567607>>జీవీ రెడ్డి<<>>(ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్) ఆరోపించిన విషయం తెలిసిందే. నిన్న తన పదవికి ఆయన రాజీనామా చేయగా ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఆ తర్వాత దినేశ్ను జీఏడీకి అటాచ్ చేసింది. ఇవాళ కొత్త ఎండీని నియమించింది.