News February 27, 2025
పోసానిపై పలు జిల్లాల్లో కేసులు

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్, లోకేశ్ను అసభ్యకరంగా దూషించారని బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, చిత్తూరు(D) యాదమరి, తిరుపతి(D) పుత్తూరు, మన్యం(D) పాలకొండ, కర్నూలు, శ్రీకాకుళంలో ఫిర్యాదులు అందగా, కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితం అన్నమయ్య(D) ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
Similar News
News February 27, 2025
మహారాష్ట్రలో గోధుమపిండితో బట్టతల!

మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో ఇటీవల 300 మందికి జుట్టు రాలిపోయి చూస్తుండగానే బట్టతల వచ్చింది. దీంతో ప్రముఖ వైద్యుడు హిమ్మత్ రావ్ బవాస్కర్ రీసెర్చ్ చేసి, రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమపిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉండటమే బట్టతలకు కారణమని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి వచ్చిన పిండి బుల్ధానాలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ అయింది. ఆ రాష్ట్రాల్లోని పర్వత శ్రేణుల్లో సిలీనియం అధికంగా ఉంటుంది.
News February 27, 2025
ఇంగ్లండ్ను ఓడించిన అఫ్గాన్ వెనుక మాస్టర్ మైండ్ ఈయనే..

CTలో ఇంగ్లండ్కు షాక్ ఇచ్చిన అఫ్గాన్ జట్టు వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ కావడం గమనార్హం. 2022లో ఆయన అఫ్గాన్ హెడ్ కోచ్గా వచ్చారు. ఆయన నేతృత్వంలోని జట్టు 2023 వన్డే WCలో PAK, ENGకు షాక్ ఇచ్చి, SL, నెదర్లాండ్స్ను చిత్తు చేసింది. తర్వాత BANపై తొలిసారి వన్డే సిరీస్ను, PAKపై T20 సిరీస్ను గెలుచుకుంది. ఇప్పుడు CTలోనూ ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
News February 27, 2025
BREAKING: అస్సాంలో భూకంపం

వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5 మ్యాగ్నిట్యూడ్గా నమోదైంది. తెల్లవారుజామున 2.25 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కాగా మంగళవారం కోల్కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో, బుధవారం ఇండోనేషియాలోని సులవేసి ప్రావిన్స్లో భూకంపం వచ్చింది.