News February 28, 2025

నిరంతరాయంగా 100రోజుల విద్యుత్ ఉత్పత్తి

image

AP: కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డ్ సృష్టించింది. 800MW ఉత్పత్తి చేయగల 3వ యూనిట్‌లో అంతరాయం లేకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో ఎండీ చక్రధర్ బాబు ప్రకటించారు. 2024 నవంబర్ 18 నుంచి 1,596 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే, సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 24గంటల వ్యవధిలోనే 4.949MU విద్యుత్ ఉత్పత్తి అయిందని చెప్పారు.

Similar News

News January 2, 2026

సంక్రాంతికి రైతు భరోసా!

image

TG: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతుభరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’తెలిపింది. SMలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో సర్కార్ ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్లు వెల్లడించింది.

News January 2, 2026

కొత్త వాహనాలకు రోడ్ సేఫ్టీ సెస్: పొన్నం

image

TG: రోడ్ సేఫ్టీ సెస్‌పై మండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌ను బలపరిచేందుకు రోడ్ సేఫ్టీ సెస్ విధించాలని నిర్ణయించాం. కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాలకు ఇది వర్తిస్తుంది. టూవీలర్స్‌కు రూ.2వేలు, కార్లలాంటి వాటికి రూ.5 వేలు, హెవీ వెహికల్స్‌కి రూ.10వేలు సెస్ విధిస్తాం’ అని తెలిపారు. APలో దీనిని 10%గా నిర్ణయించి క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.

News January 2, 2026

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

image

కొంతకాలంగా తగ్గిన బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. కేరళలోని అలప్పుళ, కొట్టాయం జిల్లాల్లో అవైన్ ఇన్ఫ్లూయెంజా వైరస్‌ను గుర్తించారు. దీంతో వైరస్ కట్టడికి చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అటు నీలగిరి, కోయంబత్తూరు సహా కేరళ సరిహద్దు గల జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం స్పెషల్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. TNలోకి వైరస్ వ్యాపించకుండా కోళ్ల వ్యాన్స్‌ను వెటర్నరీ టీమ్స్ తనిఖీ చేస్తున్నాయి.