News March 22, 2024
పోటీలో ఉన్న తండ్రీ కొడుకులు వీరే..

AP: వచ్చే ఎన్నికల్లో తండ్రీకొడుకులు పోటీ చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. మైదుకూరు TDP అభ్యర్థిగా పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కొడుకు పుట్టా మహేశ్ యాదవ్ ఏలూరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడే మహేశ్. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఆయన కుమారుడు సునీల్ యాదవ్ ఏలూరు YCP ఎంపీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకోనున్నారు.
Similar News
News October 27, 2025
యజ్ఞంలా కోటి సంతకాల సేకరణ: YCP

AP: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ చేపట్టిన కోటి సంతకాల సేకరణ యజ్ఞంలా సాగుతోందని YCP ట్వీట్ చేసింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారంది. పార్టీ నేతలు YS అవినాశ్రెడ్డి, YS మనోహర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన కార్యక్రమం జరుగుతోందని పేర్కొంది. ప్రైవేటీకరణతో ప్రజలకు కలిగే నష్టాలను వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారంది.
News October 27, 2025
7,565 కానిస్టేబుల్ పోస్టులు.. 4 రోజులే గడువు

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు SSC నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగియనుంది. 18-25 ఏళ్ల వయసువారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. రాతపరీక్ష, PE&MT, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. DEC/JANలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పేస్కేల్ రూ.21,700-రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్సైట్: <
News October 27, 2025
బాదం నూనెతో ఎన్నో లాభాలు

బాదం నూనెలో మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. బాదం, ఆముదం, ఆలివ్ నూనెల్ని సమపాళ్లలో తీసుకొని మాడుకు మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఒత్తుగా పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే తరచూ బాదం నూనెతో మసాజ్ చేస్తే డార్క్ సర్కిల్స్, ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు తగ్గి తేమ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. <<-se>>#skincare<<>>


