News March 22, 2024

MPగా పోటీ చేసే రాష్ట్రంలో ఓటు ఉండాలా?

image

రాజ్యసభ సభ్యత్వానికి కనీస వయస్సు 30సం.లు, లోక్‌సభకు పోటీ చేసేందుకు కనీస వయస్సు 25సం.లు ఉండాలి. భారత పౌరసత్వంతో పాటు, దేశంలో ఏదైనా <<12903689>>ఒక నియోజకవర్గంలో<<>> ఓటరై ఉండాలి. 2సం.ల కంటే ఎక్కువ జైలు శిక్షకు గురికావద్దు. గుర్తింపు పొందిన పార్టీ నుంచి పోటీకి ఆ నియోజకవర్గంలో ఒక ప్రపోజర్ సంతకం కావాలి. స్వతంత్ర అభ్యర్థికి పది మంది ప్రపోజర్లు ఉండాలి. రూ.25 వేల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మానసికంగా పరిపక్వత తప్పనిసరి.

Similar News

News April 20, 2025

ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

image

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.

News April 20, 2025

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.

News April 20, 2025

బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

image

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.

error: Content is protected !!