News March 5, 2025

35 సార్లు విఫలమై.. ఎట్టకేలకు IASగా!

image

IAS కావాలన్నదే ఆయన కల. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 35 సార్లు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో విఫలమయ్యారు. ఆయనెవరో కాదు హరియాణాకు చెందిన విజయ్ వర్ధన్. UPSC 2018లో 104ర్యాంకుతో IPS, 2021లో 70 ర్యాంకు సాధించి IAS అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు. ఆత్మవిశ్వాసం ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తుందని ఈయన నిరూపించారు.

Similar News

News March 6, 2025

ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా

image

ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు గెలిచింది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సొంతం చేసుకుంది. తాజాగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు సైతం తన ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

News March 6, 2025

సీఎం ప్రచారం చేసినా దక్కని విజయం!

image

TG: KNR-MDK-NZB-ADB ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోవడం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. పార్టీ అధికారంలో ఉన్నా, సీఎం రేవంత్ ప్రచారం నిర్వహించినా సిట్టింగ్ స్థానంలో గెలవకపోవడంతో ఈ జిల్లాల్లో కాంగ్రెస్ హవా తగ్గిందా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచినా, ఓడినా తమకు పోయేదేం లేదని స్వయంగా రేవంత్ వ్యాఖ్యానించడమూ ఆ పార్టీ ఓటమికి కారణమైందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News March 5, 2025

సౌతాఫ్రికా ఓటమి.. ఫైనల్‌లో కివీస్‌తో భారత్ పోరు

image

భారత్‌తో CT ఫైనల్ ఆడే జట్టేదో తేలిపోయింది. మిల్లర్ సెంచరీతో అద్భుత పోరాటం చేసినా సెమీ‌ఫైనల్-2లో NZ చేతిలో SA 50పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ నెల 9న CT ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. కివీస్ నిర్దేశించిన 363 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన SA ఒత్తిడిని జయించలేక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. చివర్లో మిల్లర్(100) 4 సిక్సులు, 10 ఫోర్లతో విధ్వంసం సృష్టించినా ఫలితం లేకపోయింది.

error: Content is protected !!