News March 5, 2025
35 సార్లు విఫలమై.. ఎట్టకేలకు IASగా!

IAS కావాలన్నదే ఆయన కల. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి 35 సార్లు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో విఫలమయ్యారు. ఆయనెవరో కాదు హరియాణాకు చెందిన విజయ్ వర్ధన్. UPSC 2018లో 104ర్యాంకుతో IPS, 2021లో 70 ర్యాంకు సాధించి IAS అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు. ఆత్మవిశ్వాసం ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తుందని ఈయన నిరూపించారు.
Similar News
News March 24, 2025
దీపక్ చాహర్పై ఆసక్తికర పోస్ట్ చేసిన సోదరి

కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే మీమ్ని ముంబై క్రికెటర్ దీపక్ చాహర్ సోదరి మాలతీ చాహర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. నిన్న జరిగిన MI-CSK మ్యాచ్లో దీపక్ 25పరుగులతో పాటు ఒక వికెట్ తీసి చెన్నైకు సులువుగా విజయం దక్కకుండా అడ్డుకున్నారు. గత 7 సీజన్లలో CSK జట్టులో ఉన్న దీపక్ ప్రస్తుతం ముంబై తరపున ఆడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆడిన జట్టుకు ద్రోహం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆమె ఫన్నీ మీమ్ షేర్ చేశారు.
News March 24, 2025
కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.
News March 24, 2025
అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.