News March 5, 2025
స్టాక్మార్కెట్లు కళకళ.. మురిసిన ఇన్వెస్టర్లు

స్టాక్మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 22,337 (+254), సెన్సెక్స్ 73,730 (+740) వద్ద ముగిశాయి. బలమైన కౌంటర్ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.4L CR మేర లాభపడ్డారు. మెటల్, PSE, మీడియా, PSU బ్యాంకు, టూరిజం, ఎనర్జీ, డిఫెన్స్, కమోడిటీస్, ఆటో షేర్లు దుమ్మురేపాయి. అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, M&M టాప్ గెయినర్స్. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, HDFC బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ లూజర్స్.
Similar News
News March 5, 2026
❤️నచ్చేశావ్ సంజూ..

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.
News March 5, 2026
సెమీస్.. భారత్ భారీ స్కోర్

T20WC సెమీస్లో ఇంగ్లండ్పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్లో న్యూజిలాండ్తో పోటీ పడుతుంది.


