News March 8, 2025

ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కోసం టీమ్ ఇండియా కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా రేపు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

Similar News

News March 22, 2026

ఆదిత్య ధర్ క్రికెట్ వదిలేయడానికి కారణం ఇదే!

image

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ భారత్ తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నారు. తనకు 2002 అండర్-19 WCలో చోటు పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు స్టువర్ట్ బిన్నీని సెలక్ట్ చేశారు. గొప్ప ఫామ్‌లో ఉన్న తనకు ఛాన్స్ ఇవ్వకుండా రాజకీయాలు చేశారని క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి సినిమాల్లోకి వచ్చారు. కాగా బిన్నీ ఆ టోర్నమెంటులో 6 మ్యాచుల్లో 34 రన్స్ మాత్రమే చేశారు.

News March 22, 2026

ప్రత్యేక ఫ్లైట్ డిమాండ్ చేసినట్లు వార్తలు.. కోహ్లీ రియాక్షన్ ఇదే!

image

ఐపీఎల్ కోసం RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఇంటికి వెళ్లి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ అరేంజ్ చేయాలని RCB మేనేజ్మెంట్‌ను డిమాండ్ చేశారని పలు రిపోర్ట్స్ వచ్చాయి. దీనిని కోహ్లీ కొట్టిపారేశారు. ఈ వార్త హాస్యాస్పదంగా ఉందని సూచించేలా ఆ రిలేటెడ్ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి లాఫింగ్ ఎమోజీ పెట్టారు.

News March 22, 2026

కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

image

పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో ఖతర్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు, మిస్సింగ్ పర్సన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నారు.