News March 10, 2025

అల్లూరి జిల్లాలో 115 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో ఇంటర్ సెకండియర్ వ్యాథ్స్, జువాలజి, హిస్టరీ పరీక్షలు సోమవారం జరిగాయి. ఈ జనరల్ పరీక్షలకు 26పరీక్ష కేంద్రాల్లో 4,315 మంది హాజరు కావాల్సి ఉండగా 4,200 మంది పరీక్షకు హాజరయ్యారు. 115 మంది పరీక్షకు హాజరుకాలేదని ఇంటర్మీడియట్ విద్యాశాకాధికారి అప్పలరాం తెలిపారు. ఒకేషనల్ పరీక్షలకు 1217మందికి 1136మంది రాశారని వెల్లడించారు. జిల్లా అంతటా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని పేర్కొన్నారు.

Similar News

News March 10, 2025

విశాఖలో ‘హయగ్రీవ’ భూములు వెనక్కి

image

AP: విశాఖలో హయగ్రీవ ఫార్మ్ అండ్ డెవలపర్స్‌కు ఇచ్చిన 12.41 ఎకరాల భూ కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనలు ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే భూమిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అటు అమరావతిలోనూ 13 సంస్థల భూ కేటాయింపులను రద్దు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ <<15713685>>నిర్ణయించిన<<>> విషయం తెలిసిందే.

News March 10, 2025

మరో అమ్మాయితో చాహల్.. ధనశ్రీ సంచలన పోస్ట్

image

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్ భార్య ధనశ్రీ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మహిళను బ్లేమ్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. దీంతో SMలో తనపై వచ్చిన కామెంట్స్‌పై ధనశ్రీ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. అటు నిన్న CT ఫైనల్ మ్యాచ్‌కు <<15704215>>చాహల్<<>> మరో అమ్మాయితో కలిసి వెళ్లిన వీడియోలు వైరల్ అయ్యాయి.

News March 10, 2025

ALERT.. నోటిఫికేషన్ విడుదల

image

AP: ECET-2025 నోటిఫికేషన్‌ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.

error: Content is protected !!