News March 10, 2025
ALERT.. నోటిఫికేషన్ విడుదల

AP: ECET-2025 నోటిఫికేషన్ను JNTU అనంతపురం విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా డిప్లొమా చదువుతున్న వారు ఇంజినీరింగ్, ఫార్మసీ సెకండియర్ సహా మరికొన్ని కోర్సుల్లో చేరవచ్చు. మే 6వ తేదీన ఉ.9-12 వరకు, మ.2-5 వరకు పరీక్ష జరుగుతుంది.
Similar News
News March 19, 2025
నెల రోజులపాటు గ్రామ గ్రామాన సంబరాలు: టీపీసీసీ చీఫ్

TG: BC కులగణన, SC వర్గీకరణపై రాష్ట్రమంతటా పెద్దఎత్తున ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. ‘అసెంబ్లీలో BC కులగణన, SC వర్గీకరణ బిల్లులను ఆమోదించుకున్నాం. ఇవి చరిత్రలోనే నిలిచిపోయే ఘట్టాలు. వీటి ప్రాముఖ్యత ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో నెల రోజులపాటు సంబరాలు నిర్వహించాలి. జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాలను కూడా నిర్వహించాలి’ అని తెలిపారు.
News March 19, 2025
నిద్రపోయే ముందు నీరు తాగుతున్నారా?

రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీరు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం బాగా జీర్ణం అవడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తదితర సమస్యలు తొలగిపోతాయి. పొట్ట తేలికగా మారిన భావన కలుగుతుంది. వీటితో పాటు నాడీ వ్యవస్థ రిలాక్స్ అయి ఒత్తిడి తగ్గుతుంది. యాంగ్జైటీ వంటి సమస్యలు దూరమై హాయిగా నిద్ర పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి గోరువెచ్చని నీరు చక్కటి పరిష్కారం.
News March 19, 2025
తూ.గో. జిల్లాలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ

AP: తూ.గో. జిల్లా దివాన్ చెరువు సమీపంలో రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అటవీ, వన్యప్రాణి సంరక్షణపై అటవీ శాఖ ఉద్యోగులు లోతైన శిక్షణ పొందేందుకు అనువైన వాతావరణ అక్కడ ఉండాలని Dy.CM పవన్ అన్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయగా తాజాగా దివాన్ చెరువు ప్రాంతంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.