News March 12, 2025
ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.
Similar News
News February 24, 2026
శిఖర్ ధవన్కు బిగ్ రిలీఫ్

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు ఊరటనిచ్చింది. భరణంగా ధవన్ ఇచ్చిన దాదాపు ₹5.72కోట్లను తిరిగిచ్చేయాలని మాజీ భార్య ఆయేషా ముఖర్జీని ఆదేశించింది. ‘ప్రాపర్టీ సెటిల్మెంట్’ కింద ఆ మొత్తం చెల్లించమని ఆస్ట్రేలియాలోని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. అది భారతీయ చట్టాలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. కాగా ఈనెల 21న <<19203658>>ధవన్<<>> సోఫీ షైన్ను రెండో వివాహం చేసుకున్నారు.
News February 24, 2026
ఒకరోజు ముందే పెన్షన్లు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లను పంపిణీ చేయనుంది. మార్చి 1న ఆదివారం ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉండటంతో ఈనెల 28న అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. పింఛన్ల పంపిణీ నేపథ్యంలో ఆ రోజున అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని CM చంద్రబాబు నిర్ణయించారు. పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని స్పష్టంచేశారు. మరోవైపు 28న పెన్షన్లు అందుకోని వారికి మార్చి 2న ఇవ్వనున్నారు.
News February 24, 2026
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని నిర్ణయం
*విశాఖలో రూ.2,387 కోట్లతో నిర్మించే సెమీ కండక్టర్ పరిశ్రమకు ఆమోదం
*సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్కు కొత్త శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయం
*విశాఖ, తిరుపతి, కాకినాడ, సత్యసాయి, చీరాల, రాజమండ్రిలో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదం


