News March 12, 2025
ముగ్గురు IPSల సస్పెన్షన్ పొడిగింపు

AP: ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు IPSల సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాంతిరాణా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీలపై సస్పెన్షన్ను మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25 వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి.
Similar News
News January 30, 2026
చర్చలకు మాస్కో రండి.. జెలెన్స్కీకి రష్యా ఆహ్వానం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని శాంతి చర్చలకు మాస్కో రావాలని రష్యా ఆహ్వానించింది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా పంపిన ఆహ్వానాన్ని జెలెన్స్కీ తిరస్కరించారు. తన దేశంపై మిసైళ్లు ప్రయోగిస్తున్న దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు.
News January 30, 2026
WPL: ఫైనల్కు దూసుకెళ్లిన ఆర్సీబీ

WPLలో ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ యూపీ వారియర్స్పై గెలుపుతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. యూపీ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 13.1 ఓవర్లలోనే ఛేదించింది. గ్రేస్ హారిస్(75), స్మృతి మంధాన(54*) చెలరేగి ఆడారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే, ఆశా శోభన తలో వికెట్ పడగొట్టారు. తాజా ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి యూపీ నిష్క్రమించింది.
News January 30, 2026
UGC కొత్త రూల్స్ ఏంటి? వివాదం ఎందుకు?(1/2)

విద్యాసంస్థల్లో వివక్షను ఆపడమే లక్ష్యంగా UGC కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటి ప్రకారం.. వర్సిటీల్లో Equal Opportunity Centre (EOC) ఏర్పాటు చేయాలి. SC, STలతో పాటు కొత్తగా OBC, EWS విద్యార్థులకూ రక్షణ కల్పించాలి. కంప్లైంట్ వచ్చిన 24 గంటల్లోపు EOC సమావేశమవ్వాలి. 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. అలాగే కొత్తగా మరికొన్ని యాక్షన్స్నూ Discriminationగా గుర్తిస్తూ వివక్ష నిర్వచనాన్ని మార్చారు.


