News March 12, 2025

ముగ్గురు IPSల సస్పెన్షన్ పొడిగింపు

image

AP: ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు IPSల సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాంతిరాణా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీలపై సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25 వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి.

Similar News

News March 18, 2025

‘దమ్ముంటే పట్టుకోరా’.. ఇన్విజిలేటర్‌కు సవాల్

image

AP: రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. శ్రీకాకుళం (D) టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై ‘దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్’ అనే రాతలు కనిపించాయి. దీన్ని చూసిన ఇన్విజిలేటర్లు మండిపడ్డారు. ఇది ఆకతాయిల పనే అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ పిచ్చిరాతలపై మీ COMMENT.

News March 18, 2025

సునీత.. మీరు భారత్ రావాలి: ప్రధాని మోదీ

image

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు PM మోదీ లేఖ రాశారు. తొలుత భారత్ తరఫున శుభాకాంక్షలు తెలిపిన ఆయన వేల మైళ్ల దూరంలో ఉన్నా ఎప్పుడూ తమ హృదయాలకు దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. తానెప్పుడు బైడెన్, ట్రంప్‌ను కలిసినా సునీత బాగోగుల గురించి అడిగినట్లు తెలిపారు. భూమి మీదకు తిరిగొచ్చిన తర్వాత భారత్‌ సందర్శనకు రావాలని కోరారు. తనకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తామని మోదీ తెలిపారు.

News March 18, 2025

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

image

TG: BRS నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!