News March 12, 2025

ముగ్గురు IPSల సస్పెన్షన్ పొడిగింపు

image

AP: ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ముగ్గురు IPSల సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. కాంతిరాణా, సీతారామాంజనేయులు, విశాల్ గున్నీలపై సస్పెన్షన్‌ను మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. రివ్యూ కమిటీ సిఫార్సు తర్వాత సెప్టెంబర్ 25 వరకు వారిపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వీరు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి.

Similar News

News April 17, 2026

ఆగిన బంగారం ఇంపోర్ట్స్.. పెరగనున్న ధరలు?

image

కేంద్ర ప్రభుత్వం (DGFT) నుంచి అనుమతులు రాకపోవడంతో భారత బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులు నిలిచిపోయాయని రాయిటర్స్ పేర్కొంది. దీంతో టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఆర్డర్లు ఆగిపోయాయి. ఏటా ఏప్రిల్‌ ఆరంభంలోనే ఇచ్చే అనుమతి ఆలస్యం కావడంతో విదేశీ ఆర్డర్లకు బ్రేక్ పడింది. దీనివల్ల దేశీయంగా సరఫరా తగ్గి ధరలు పెరిగే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

News April 17, 2026

బుమ్రా స్పీడ్ పెంచాలి.. ఇర్ఫాన్ సూచనలు

image

IPL: MI స్టార్ బౌలర్ బుమ్రా ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచుల్లోనూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ పలు సూచనలు చేశారు. బుమ్రా బౌలింగ్ వేగం తగ్గిందని, దాంతో పాటు స్లో బాల్స్ ఎక్కువగా వేస్తున్నారన్నారు. అలా కాకుండా వేగంగా బౌలింగ్ చేస్తూ అప్పుడప్పుడు స్లో బాల్స్ వేస్తే వికెట్లు వచ్చే ఛాన్సుందన్నారు. బుమ్రాకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదని, చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు.

News April 17, 2026

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే?

image

ఎంత కష్టపడి సంపాదించినా కొందరి చేతిలో డబ్బు నిలవదు. శుక్ర, గురు గ్రహ అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల అలా జరుగుతుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక స్థిరత్వం కోసం శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజ, కనకధారా స్తోత్ర పఠనం చేయాలని సూచిస్తున్నారు. ఇంటి ఈశాన్య మూలను శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అంటున్నారు. ఈ పరిహారాలు పాటిస్తే ఆర్థిక స్థితిని మెరుగుపడి అప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందట.