News March 13, 2025
TODAY HEADLINES

* తల్లికి వందనం పథకంలో ఎలాంటి నిబంధనలు లేవు: చంద్రబాబు
* ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్
* రేవంత్ను మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి: KTR
* ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేస్తాం: లోకేశ్
* బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణం: పోసాని
* ఈనెల 14న హైదరాబాద్లో మద్యం షాపులు బంద్
* అసెంబ్లీ సమావేశాలకు హాజరైన KCR
* భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత
* మారిషస్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ
Similar News
News March 13, 2025
21 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు!

భరతమాత ముద్దుబిడ్డ సర్దార్ ఉద్దమ్ సింగ్ జలియన్వాలా బాగ్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుని నేటికి 85 ఏళ్లు పూర్తయ్యాయి. 1919లో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యర్ పాలనలో బ్రిటిషర్లు దాదాపు 400 మంది పౌరులను దారుణంగా చంపారు. ఇందుకు ప్రతీకారంగా ఉద్దమ్ 1940 మార్చి 13న లండన్లో డయ్యర్ను కాల్చి చంపారు. దీంతో 1940 జులై 31న అతడిని ఉరి తీశారు. సింగ్ ధైర్యానికి Shaheed-i-Azam అనే బిరుదు వచ్చింది.
News March 13, 2025
Stock Markets: ఆ రెండు రంగాల షేర్లు అదుర్స్

స్టాక్మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,504 (32), సెన్సెక్స్ 74,166 (140) వద్ద చలిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సీజ్ఫైర్, గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడమే ఇందుకు కారణాలు. CPSE, PSE, ఎనర్జీ, చమురు, PSU బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. స్మాల్, మిడ్క్యాప్, ఆటో, రియాల్టి, మీడియా, ఐటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. BEL, ONGC టాప్ గెయినర్స్.
News March 13, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.81,200లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.600 పెరగడంతో రూ.88,580కు చేరింది. అటు వెండి ధర కూడా నిన్న రూ.2వేలు, ఇవాళ రూ.1000 పెరగడంతో ఆల్ టైమ్ హైకి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.1,10,000గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.