News March 13, 2025

ఇంకుడు గుంతల్లో భద్రాద్రి అగ్రస్థానంలో ఉండాలి: కలెక్టర్

image

పాల్వంచ: జల సంచయ్ జన్ భాగీదరి క్యాచ్ ద రైన్ అమలులో భాగంగా దేశంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంత తవ్వకానికి యువకులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని, భవిష్యత్తు కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఇంకుడు గుంతలు చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 19, 2026

VZM: 21న ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడా ఎంపికలు

image

ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉ.8 గంటలకు హాజరుకావాలన్నారు.

News April 19, 2026

అవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్

image

పల్నాడు జిల్లాలో ఎండలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని కలెక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. ముఖ్యంగా మే 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 45°C నుంచి 55°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

News April 19, 2026

T2OI కెప్టెన్‌గా శ్రేయస్?

image

T2OI కెప్టెన్‌గా సూర్యను తొలగించాలనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. IPLలో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు T20 క్రికెట్‌లో నాలుగో స్థానంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని పేర్కొంది. పంత్, గిల్ పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాసుకొచ్చింది. సూర్యకు కెప్టెన్‌గా మంచి మార్కులు ఉన్నా ఆటగాడిగా ఫెయిలవుతున్నారు.